ఏడుపాయల జాతరకు రూ. 2 కోట్లు..రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు  

ఏడుపాయల జాతరకు రూ. 2 కోట్లు..రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు  

మెదక్ /పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత  జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసింది. మూడు రోజుల పాటు జాతర నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు కల్పించేందుకు అధికారులు నిధులను వినియోగిస్తారు. కలెక్టర్​ రాహుల్​రాజ్​ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.  ఏడుపాయల జాతర రాష్ట్ర పండుగ కావడంతో  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించానున్నారు.