
- మైన్స్ డెవలప్మెంట్
- చైర్మన్ ఈరవత్రి అనీల్
నిజామాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్టేట్ మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనీల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మాట్లాడుతూ విలేజ్ డెవలప్మెంట్కమిటీల పేరుతో చేస్తున్న సాంఘిక బహిష్కరణలను ఉపేక్షించమని హెచ్చరించారు.
ఆర్థికంగా వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న వారికి ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్ సమగ్ర విచారణ తర్వాతే ఇచ్చేలా ఆర్డీవో, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ స్రవంతి, అసిస్టెంట్ డైరెక్టర్ నర్సయ్య, గైని గంగారాం, బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, వినోద్కుమార్, రవీందర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగరంలోని జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.