కొత్త థర్మల్​ పవర్​ ప్లాంట్​ జెన్​కోకు కేటాయించాలి

కొత్త థర్మల్​ పవర్​ ప్లాంట్​ జెన్​కోకు కేటాయించాలి
  • స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రామగుండంలో నిర్మించనున్న కొత్త థర్మల్ పవర్​ ప్లాంట్​ను జెన్​కోకే కేటాయించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్(టీజీపీఈఏ) డిమాండ్​ చేసింది. ఆదివారం హైదరాబాద్​లోని జెన్​కో ఆడిటోరియంలో అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది.

ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించి కీలక తీర్మానాలు చేసినట్టు టీజీపీఈఏ అధ్యక్షుడు రత్నాకర్ రావు, జనరల్​ సెక్రటరీ సదానందం మీడియాకు వెల్లడించారు.

ఈ సమావేశం రామగుండం పవర్​ ప్లాంట్​ నిర్మాణంలో భాగస్వామ్య నిర్ణయాన్ని సింగరేణి తీవ్రంగా వ్యతిరేకించిందని, రామగుండం, పాల్వంచ థర్మల్​ ​ ప్లాంట్​లను జెన్​కో ద్వారానే నిర్మించాలని డిమాండ్ చేసిందని తెలిపారు.