
హైదరాబాద్, వెలుగు: ఇండియా టెన్నిస్ ప్లేయర్, హైదరాబాదీ యమలపల్లి సహజ అమెరికాలోని కన్సాస్లో జరుగుతున్న ఐటీఎఫ్ 35కె విమెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరుకుంది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 6–1, 6–1తో ఒలీవియా లిన్సెన్ (పోలాండ్)ను వరుస సెట్లలో చిత్తు చేసింది.