
తెలంగాణ బడ్జెట్ కు విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న గురుకుల పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించటంతోపాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురాబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణలో 58 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, నిర్వహణ కోసం 11 వేల 600 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది చారిత్రాత్మకం అని ప్రకటించిన మంత్రి భట్టి.. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను 20 నుంచి 25 ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు ప్రకటించారాయన. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్యను అందించే విధంగా వీటిని ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారాయన. ఆడిటోరియాలు, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్రీడా మైదానాలు, క్రికెట్, ఫుల్ బాల్ గ్రౌండ్స్ వంటి సదుపాయాలు ఈ స్కూల్స్ లో ఉంటాయన్నారు. పాఠశాల ఆవరణలోనే టీచర్లు, ఇతర ఇబ్బంది ఉండే విధంగా వాళ్లకు క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నట్లు వెల్లడించారాయన. ఈ స్కూళ్లలో విద్యుత్ కోసం సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారాయన.
Also Read:-రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం ఇస్తారని.. కాంపిటీషన్ కు తగ్గట్టు ఐఐటీ, జేసీసీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు పిల్లలకు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు.