
- లేదంటే బార్లకు డ్రా సిస్టంఅమలు చేయాలి
ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో బార్ల లైసెన్స్ రెన్యువల్పద్దతి ఎలా ఉందో వైన్షాపులకూ అదే విధంగా అమలు చేయాలని తెలంగాణ వైన్స్డీలర్స్అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అసోసియేషన్అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు, జనరల్సెక్రటరీ వి.రామచంద్రారెడ్డి, కోశాధికారి సుభాశ్ కలిసి మాట్లాడారు. ఎక్సైజ్శాఖలో బార్లకు ఒక రూల్, వైన్షాపులకు మరో రూల్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బార్లను కూడా లాటరీ పద్దతిలో కేటాయించాలని, లేదంటే వైన్షాపులకు రెన్యువల్ విధానం అమలు చేయాలన్నారు.
ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు వైన్షాపుల టైమింగ్ ఉంటే, రాత్రి 10 వరకు మాత్రమే తమకు టైమింగ్ఇవ్వాలని ఇటీవల అధికారులకు బార్ల యాజమాన్యాలు దరఖాస్తు ఇచ్చారన్నారు. అదేవిధంగా పర్మిట్రూమ్విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని, పర్మిట్ రూమ్వద్ద కిచెన్ అనేది ఉండదన్నారు. మరోవైపు, బార్లలో 375,180 ,90 ఎంఎల్బాటిళ్లఅమ్మడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
అయితే, ఆయా బాటిళ్లను కొన్నవారు అక్కడే తాగాలని, బయటకు తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. అయినప్పటికీ బార్లలో బాటిళ్లు అమ్మడం ద్వారా తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపించారు.