
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు దోచుకునేందుకు ఏపీ లైన్ క్లియర్ చేసుకుంటున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ కెపాసిటీని లక్షన్నర క్యూసెక్కులకు పెంచుకున్న పొరుగు రాష్ట్రం.. దాని కింద నిర్మించిన శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ) ద్వారా పూర్తి స్థాయిలో నీటిని తరలించుకుపోయేందుకు వీలుగా వారం నుంచి లైనింగ్ పనులను స్పీడప్ చేసింది
శ్రీశైలం రైట్ మెయిన్కెనాల్కు ఏపీ చేపడ్తున్న లైనింగ్పనులను కృష్ణా బోర్డు అడ్డుకోకపోవడంపై తెలంగాణ తీవ్రంగా స్పందించింది. లైనింగ్పనులను ఆపాలంటూ ఇప్పటికే 2023 సెప్టెంబర్, 2024 జులైలో రెండు సార్లు ఫిర్యాదు చేసినా బోర్డు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. లైనింగ్పనులను చేపట్టకుండా ఏపీని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం కేఆర్ఎంబీకి ఈఎన్సీ అనిల్కుమార్లేఖ రాశారు. 1960 సెప్టెంబర్తర్వాత చేపట్టిన అన్ని ప్రాజెక్టులకూ ఇన్సైడ్ బేసిన్అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని బచావత్ట్రిబ్యునల్అవార్డు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. బచావత్ట్రిబ్యునల్కూడా కేవలం ఇన్సైడ్బేసిన్ప్రాజెక్టులకే నీటి కేటాయింపులను చేసిందని స్పష్టం చేశారు. శ్రీశైలం కేవలం జలవిద్యుదుత్పత్తి కోసమే నిర్మించారని, ఔట్సైడ్ బేసిన్కు నీటిని తరలించరాదంటూ ట్రిబ్యునల్స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
►ALSO READ | చేబ్రోలు కిరణ్ పై దాడి.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్..
1976–77 ఒప్పందం ప్రకారం ఒపెన్కెనాల్ద్వారా చెన్నైకి 1500 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే తరలించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ.. శ్రీశైలం నుంచి పెన్నా బేసిన్కు నీటిని తరలించే శ్రీశైలం రైట్బ్రాంచ్కెనాల్(ఎస్ఆర్బీసీ)కి శ్రీకారం చుట్టి.. సీడబ్ల్యూసీ ఆమోదం కోసం పంపిందని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ భాగమైనందున సీడబ్ల్యూసీకి గానీ, ట్రిబ్యునళ్లముందుగానీ తమ వాదన వినిపించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఏపీ తన తీరు మార్చుకోకుండా శ్రీశైలం రైట్మెయిన్కెనాల్కు లైనింగ్వర్క్స్ను పూర్తి చేసేలా వేగంగా పనులను చేపడుతున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం అపెక్స్కౌన్సిల్అనుమతి లేకుండా, కృష్ణా బోర్డు ఆమోదం తెలపకుండా ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచేలా కెనాల్కు ఎలాంటి లైనింగ్పనులను చేపట్టడానికి అధికారం లేదని స్పష్టం చేశారు. కాబట్టి ఏపీ వెంటనే ఆ పనులను నిలుపుదల చేసేలా కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవాలని, ఏపీని అడ్డుకోవాలని డిమాండ్చేశారు. దాంతోపాటు రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ , ఎస్ఆర్ఎంసీపై కేంద్ర జలశక్తి శాఖ, తెలంగాణకు ఏపీ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.