
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి..ప్రతిపక్షనేత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్)ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని విజయ్పాల్రెడ్డి దాఖలు చేసిన పిల్ను హైకోర్టు విచారణ చేపట్టింది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అసెంబ్లీ వేదికగా చట్ట సభలో ప్రజాసమస్యలను చర్చించాల్సిన బాధ్య ప్రతిపక్షనేతకు ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హుడిగా ప్రకటించవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీచేయాలని హైకోర్టును కోరారు.
ఈ పిల్ ను విచారిస్తున్న ధర్మాసనం ఇందులో జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని ప్రశ్నించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యానికి అర్హత లేదని శాసనసభ వ్యవహారాల తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఈ పిల్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని... ఈ మేరకు వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరిన పిటీషనర్ న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.