దేశంలో వొడాఫోన్​ 5జీ సేవలు ప్రారంభం

దేశంలో వొడాఫోన్​ 5జీ సేవలు ప్రారంభం

న్యూఢిల్లీ:  టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) మనదేశంలో 5జీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు బుధవారం ముంబైలో అందుబాటులోకి వచ్చాయి. త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. రాబోయే మూడేళ్లలో 17 సర్కిళ్లలోని వంద ప్రాంతాల్లో ఈ సేవలను అందిస్తామని కంపెనీ తెలిపింది. 

ఇందుకోసం రూ.55 కోట్ల వరకు ఖర్చు చేస్తామని ప్రకటించింది.  4జీ కంటే 5జీ ఇంటర్నెట్​ స్పీడ్​ చాలా ఎక్కువ ఉంటుంది.      వొడాఫోన్​ ఐడియా షేర్లు బుధవారం ఐదు శాతం పెరిగి రూ.7.46 వద్ద ముగిశాయి.