
ఆడపిల్ల పుడితే చెత్త కుండీలో పడేయటం, నీళ్లలో ముంచి చంపేయడం లాంటి ఘటనలు జరుగుతున్న ఈ రోజుల్లో ఒక జంట మాత్రం సెలబ్రేట్ చేసుకోవడం విశేషంగా మారింది. ఆస్పత్రిలో ఉన్న సిబ్బందికి, బంధువులకు, మిగతా పేషెంట్స్ కు మొక్కలు పంచి సంబరం చేసుకున్నారు. ఆదిలాబాద్ కు చెందిన ఈ జంట చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామానికి చెందిన అంతర , దీపక్ గాడ్గే దంపతులకు పాప జన్మించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ అస్పత్రిలో పాపకు జన్మిచ్చింది తల్లి. దంపతులకు ఆడపిల్ల పుట్టడంతో సంతోషంలో పొంగిపోయారు.
ALSO READ | రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు అందజేస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మొక్కలు తెప్పించి అస్పత్రిలో పంపిణీ చేశారు. సిబ్బందికి, ఇతర పేషెంట్స్ కు మొత్తం 108 మొక్కలు పంపిణి చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కూతురు పుట్టడం అంటే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లేనని ఆనందాన్ని వ్యక్తం చేశారు.