
జూబ్లీహిల్స్, వెలుగు: తెలుగును ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రథమ భాషగా బోధించాలని వక్తలు కోరారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆచార్య చింతకింది కాశీం ఆధ్వర్యంలో తెలుగు భాషా పరిరక్షణ రౌండ్టేబుల్సమావేశం నిర్వహించారు. మన భాష–మన హక్కు అనే అంశంపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్కోదండరాం, డాక్టర్నందిని సిదారెడ్డి, ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు, ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, ప్రొఫెసర్ బన్న ఐలయ్య, ప్రొఫెసర్ సిల్మానాయక్, ప్రొఫెసర్ లావణ్య, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్కళాశాలల్లో సంస్కృతం పరీక్షను దేవనాగరి లిపిలోనే రాసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.