ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి

ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి

హైదరాబాద్, వెలుగు :  ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌లో తెలుగు టైటాన్స్ నిరాశ పరుస్తోంది. వరుసగా మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓడి హ్యాట్రిక్ పరాజయం ఖాతాలో వేసుకుంది.  గచ్చిబౌలిఇండోర్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  దబాంగ్‌‌‌‌‌‌‌‌ ఢిల్లీ కేసీ 41–37తో టైటాన్స్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. ఢిల్లీ ప్లేయర్లు నవీన్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, అషు మాలిక్‌‌‌‌‌‌‌‌ చెరో 15 పాయింట్లతో తమ జట్టును గెలిపించారు.  

టైటాన్స్ కెప్టెన్ పవన్‌‌‌‌‌‌‌‌ సెహ్రావత్‌‌‌‌‌‌‌‌ 18 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో టైటాన్స్‌‌‌‌‌‌‌‌కు ఇది మూడో ఓటమి.  అంతకుముందు మాజీ చాంపియన్లు యు ముంబా, బెంగాల్‌‌‌‌‌‌‌‌ వారియర్స్‌‌‌‌‌‌‌‌ మధ్య ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ 31-–31తో టైగా ముగిసింది.