సిద్దు జొన్నలగడ్డ .. తెలుసు కదా మూవీ షూటింగ్‌‌‌‌కు రెడీ

సిద్దు జొన్నలగడ్డ .. తెలుసు కదా మూవీ షూటింగ్‌‌‌‌కు రెడీ

టిల్లు స్క్వేర్’తో మరో బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న సిద్దు జొన్నలగడ్డ...  ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ప్రముఖ స్టైలిష్ట్‌‌‌‌ నీరజ కోన ఈ మూవీతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. గత ఏడాది పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించగా.. ఇప్పుడు షూటింగ్‌‌‌‌కు రెడీ అవుతోంది. ఆగస్టు 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

 హైదరాబాద్‌‌‌‌లో ముప్ఫై రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది.  సినిమాకు ఎంతో కీలకమైన ఈ లెన్తీ షెడ్యూల్‌‌‌‌లో టాకీ పార్ట్‌‌‌‌,  పాటలను షూట్ చేయనున్నారు.  లీడ్ యాక్టర్స్‌‌‌‌ అంతా షూటింగ్‌‌‌‌లో పాల్గొననున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్స్‌‌‌‌.  వైవా హర్ష కీలకపాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్.  తమన్ సంగీతం అందిస్తున్నాడు.