కెప్టెన్‌గా బవుమా.. టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా

కెప్టెన్‌గా బవుమా.. టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా

ఆగస్టు 7 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం క్రికెట్ దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. టెంబా బావుమా నాయకత్వంలో 16 మందితో కూడిన బలమైన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌తో జరిగిన రెండో  టెస్టులో ఆడలేకపోయిన బవుమా తిరిగి ప్రొటీస్ జట్టు పగ్గాలు చేపట్టాడు. 

ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మాథ్యూ బ్రీట్జ్కే దక్షిణాఫ్రికా తరుపున అరంగ్రేటం చేయనున్నాడు. ఇక, టీ20 ప్రపంచకప్ ఆడి అలసిపోయిన పేసర్ మార్కో జాన్సెన్ పనిభారాన్ని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకున్నాడు. ఆగస్టు 7 నుంచి 19 వరకు  టెస్ట్ సిరీస్ జరగనుండగా.. అనంతరం ఆగస్టు 23 నుంచి టీ20 సిరీస్ షురూ కానుంది.  

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా, డేవిడ్ బెడింగ్‌హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్ , ఐడెన్ మార్క్రామ్ , వియాన్ ముల్డర్, లుంగీ న్గిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ ప్యాటర్సన్, కగిసో రాట్టాడా స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రెయిన్.