Weather update: మార్చిలోనే మంటలు.. రెండు రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్​..!

Weather update: మార్చిలోనే మంటలు.. రెండు రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్​..!
  • 18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు
  • నాలుగు జిల్లాల్లో 41 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు
  • అత్యధికంగా నిర్మల్​ జిల్లా లింగాపూర్​లో 40.7 డిగ్రీలు
  • రాత్రి టెంపరేచర్లలోనూ పెరుగుదల
  • రెండు రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్​

హైదరాబాద్, వెలుగు: ఎండలు ముదురుతున్నాయి. మార్చి మధ్యలోనే ఎండ సెగ పెరిగిపోతున్నది. నిరుడు ఇదే టైమ్​తో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల మేర ఎక్కువే రికార్డవుతున్నాయి. గతేడాది ఒకట్రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదైతే.. ఇప్పుడు 18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 39 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. 

4  జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటున్నది. గురువారం అత్యధికంగా నిర్మల్​ జిల్లా లింగాపూర్​లో 40.7 డిగ్రీల టెంపరేచర్​ రికార్డయింది. ఆదిలాబాద్​ జిల్లా బేల, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెనలో 40.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 40.4, జగిత్యాల, నల్గొండ, పెద్దపల్లిల్లో 40.3, జయశంకర్​ భూపాలపల్లిలో 40.2, కామారెడ్డి, ఖమ్మంలో 40.1, మంచిర్యాల, హనుమకొండ, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 39 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. 4  జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటున్నది. గురువారం అత్యధికంగా నిర్మల్​ జిల్లా లింగాపూర్​లో 40.7 డిగ్రీల టెంపరేచర్​ రికార్డయింది. ఆదిలాబాద్​ జిల్లా బేల, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెనలో 40.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 40.4, జగిత్యాల, నల్గొండ, పెద్దపల్లిల్లో 40.3, జయశంకర్​ భూపాలపల్లిలో 40.2, కామారెడ్డి, ఖమ్మంలో 40.1, మంచిర్యాల, హనుమకొండ, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మేడ్చల్, యాదాద్రి, హైదరాబాద్​ జిల్లాలు మినహా మిగతా అన్నిచోట్లా 39 డిగ్రీలకన్నా ఎక్కువ టెంపరేచర్​ నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతున్నాయి. 

పలుచోట్ల 20 డిగ్రీలకన్నా ఎక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 21.8 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​ జిల్లాల్లో 20 డిగ్రీలు రికార్డ్​ అయింది. మిగతా జిల్లాల్లో 16.8 డిగ్రీల నుంచి 19 డిగ్రీల మధ్య నైట్​ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. 

రెండ్రోజులు 18 జిల్లాలకు అలర్ట్​

మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 18 జిల్లాల్లో 41 డిగ్రీలకు టెంపరేచర్లు చేరువయ్యే అవకాశం ఉన్నట్టు తెలంగాణ డెవలప్​మెంట్​ అండ్​ ప్లానింగ్​ సొసైటీ (టీజీడీపీఎస్​) అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, జనగామ, వరంగల్​, ములుగు, హనుమకొండ, జయశంకర్​ భూపాలపల్లి, కరీంనగర్​, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్​ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే చాన్స్​ ఉన్నట్టు అంచనా వేసింది. కాగా, ఆగ్నేయ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.  3 రోజులు 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.