రైల్వే ప్రయాణికులు అలర్ట్.. ఇక పై నుంచి ఈ రైళ్లు చర్లపల్లిలో ఎక్కాల్సిందే..

రైల్వే ప్రయాణికులు అలర్ట్.. ఇక పై నుంచి ఈ రైళ్లు చర్లపల్లిలో ఎక్కాల్సిందే..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో  పలు ఫ్లాట్ ఫామ్స్ మూసివేశారు. దీంతో పలు రైళ్లను ఇతర రైల్వేస్టేషన్ కు  మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో  కొన్ని ప్రత్యేక రైళ్లను   సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి టెర్మినల్ కు  తాత్కాలికంగా మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.

చర్లపల్లి టెర్మినల్  నుంచి బయల్దేరనున్న  ట్రైన్లు ఇవే..

  • సికింద్రాబాద్ - అగర్తల (ఏప్రిల్ 28 నుంచి)
  • అగర్తల - సికింద్రాబాద్ (మే 2 నుంచి)
  • సికింద్రాబాద్ - ముజఫర్పూర్ (మే 1 నుంచి )
  •  ముజఫర్పూర్ - సికింద్రాబాద్ (ఏప్రిల్ 29 నుంచి )
  •  సికింద్రాబాద్ - సాంత్రాగచి (ఏప్రిల్ 29 నుంచి)
  •  సంత్రాగచి - సికింద్రాబాద్ (ఏప్రిల్ 30 నుంచి)
  •  సికింద్రాబాద్ - దానపూర్ (ఏప్రిల్ 26 నుంచి)
  •  దనాపూర్ - సికింద్రాబాద్ (ఏప్రిల్ 28 నుంచి)
  • హైదరాబాద్ - రక్సౌల్ (ఏప్రిల్ 26 నుంచి)
  •  రక్సౌల్ - హైదరాబాద్ (ఏప్రిల్ 29 నుంచి) చర్లపల్లి టెర్మినల్ నుంచి బయల్దేరతాయి.