
హైకోర్టులో కొత్తగా నియమితులైన 10 మంది న్యాయ మూర్తులు ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయిస్తున్నారు. దీంతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుతం 19 మంది జడ్జిలు సేవలు అందిస్తున్నారు. కాగా హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. హైకోర్టులో ఒకేసారి 10 మంది న్యాయమూర్తులు నియమితులవడం ఇదే తొలిసారి. కొత్తగా నియమితులైనవారిలో.. న్యాయ వాదుల కోటా నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్వీ శ్రవణ్ కుమార్, న్యాయాధికారులు విభాగం నుంచి గున్ను అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబ శివ నాయుడు, ఏ సంతోష్ రెడ్డి, డాక్టర్ డి.నాగార్జున హైకోర్టు న్యాయ మూర్తులుగా ప్రమాణం చేశారు.