తెనాలి డబుల్ హార్స్కు ఫాస్ట్​ గ్రోయింగ్​ బ్రాండ్​ అవార్డ్

తెనాలి డబుల్ హార్స్కు ఫాస్ట్​ గ్రోయింగ్​ బ్రాండ్​ అవార్డ్

హైదరాబాద్, వెలుగు: పప్పుధాన్యాల బ్రాండ్​ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌‌‌‌నకు మరో గుర్తింపు లభించింది. యూఆర్‌‌‌‌ఎస్ మీడియా,  ఆసియా వన్ మ్యాగజైన్‌‌‌‌ నిర్వహించిన 25వ ఏషియన్ బిజినెస్ అండ్​ సోషల్ ఫోరమ్ కార్యక్రమంలో సంస్థకు ఇండియాస్ ఫాస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ అండ్​ లీడర్స్ 2024–25 అవార్డు లభించింది.

 ఈ పురస్కారాన్ని కంపెనీ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్​ ప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గౌరవం తెనాలి డబుల్ హార్స్ కుటుంబానికి గర్వకారణమని, తమ ప్రతి వినియోగదారుడు, డిస్ట్రిబ్యూటర్, భాగస్వామి నమ్మకానికి నిదర్శనమని అన్నారు.