మానుకోట ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఉద్రిక్తత

మానుకోట ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఉద్రిక్తత
  • సేవాలాల్ జయంతి నిర్వహణపై ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత 
  • ఎవరూ వెళ్లకుండా గుడికి లాక్ వేసిన పోలీసులు  
  •  నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు

మహబూబాబాద్​, వెలుగు: మహబూబాబాద్​జిల్లా కేంద్రంలోని అనంతారం రోడ్​లో  సంత్​సేవాలాల్ఆ  లయం వద్ద ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం సంత్​ సేవాలాల్​ మహారాజ్​286వ జయంతి సందర్భంగా ఏర్పాట్లు చేసేందుకు శుక్రవారం బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యే శంకర్​నాయక్​ తన అనుచరులతో వెళ్లారు.  దీంతో కాంగ్రెస్ ​ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్​అనుచరులు వెళ్లి నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు.

 తమ సొంత భూమిలో గుడిని నిర్మించామని మాజీ ఎమ్మెల్యే తెలపగా.. ప్రభుత్వ నిధులతో అసైన్డ్​ భూమిలో కట్టారని కాంగ్రెస్ ​కార్యకర్తలు పేర్కొన్నారు. మహబూబాబాద్ ​రూరల్​ సీఐ సర్వయ్య, టౌన్​ సీఐ దేవేందర్ ​సిబ్బందితో వెళ్లి ఇరువర్గాలను గుడిలోకి వెళ్లకుండా గేటు లాక్ వేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సేవాలాల్​వేడుకలు నిర్వహిస్తారని తెలపడంతో ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. సేవాలాల్​ వేడుకలపై స్థానికంగా ఉత్కంఠత నెలకుంది.