AP News: తిరుపతమ్మ తిరునాళ్లలో వైసీపీ, టీడీపీ రాళ్ల దాడులు : పోలీసులకే గాయాలు

AP News: తిరుపతమ్మ తిరునాళ్లలో వైసీపీ, టీడీపీ రాళ్ల దాడులు : పోలీసులకే గాయాలు

ఆంధ్రప్రదేశ్​ ఎన్టీఆర్​ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.  పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాల్లో సోమవారం ( మార్చి 17)  టీడీపీ .. వైసీపీ వర్గాల్లో మధ్య ఘర్షణ చెలరేగింది.  పోలీస్​ స్టేషన్​ సెంటరులో వైసీపీ నేతలకు చెందిన ప్రభ బండ్లను ఆపి.. టీడీపీ వారి ప్రభ బండ్లను పంపడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.  దీంతో దేవుడి ఉత్సవాల్లో కూడ రాజకీయం చేస్తున్నారని కొంతమంది పోలీసులపైకి రాళ్లు రువ్వారు. 

ఈ ఘటనలో  ఒక ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్స్ కి తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  అనంతరం దాడికి పాల్పడిన వారిని గుర్తించిన పోలీసులు  కేసు నమోదు చేశారు.  ఈ రోజున ( మార్చి 18)న పెనుగంచి ప్రోలులో భారీగా పోలీసులు మోహరించారు.  గుంపులు.. గుంపులుగా తిరగవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.