నిర్మల్​ పట్టణంలో 50 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు

నిర్మల్​ పట్టణంలో 50 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు

నిర్మల్/కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: నిర్మల్​ పట్టణంలోని జుమ్మే రాత్ పేట్ హైస్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 1974లో టెన్త్, ఇంటర్ చదివిన వారంతా 50 ఏండ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడో నివసిస్తున్నవారంతా ఆదివారం స్థానిక ఆర్కే ఫంక్షన్​హాల్​లో కలుసుకొని ఒకరినొకరు పలుకరించుకొని భావోద్వేగానికి గురయ్యారు. వారు చదువుకునే సమయంలో ఉన్న ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకొని సంబురంగా గడిపారు. వయసు పైబడినా లెక్కచేయకుండా పోటీల్లో పాల్గొని ఔరా అనిపించారు.

రామకృష్ణాపూర్, బెల్లంపల్లిలో..

రామకృష్ణాపూర్​ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్​ హైస్కూల్​లో 2001-–02 పదో తరగతి బ్యాచ్​ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. అంతా ఒకచోట చేరి నాటి స్మృతులను గుర్తుచేసుకొని ఉల్లాసంగా గడిపారు. అప్పటి టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం మల్రాజు రాఘునాథ్ ​రావు, మంచిర్యాల సంభాగ్​ శైక్షణిక్ ​ప్రముఖ్​ పూదరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లిలోని ప్రగతి జూనియర్ కాలేజీలో 1997–-99 ఇంటర్ (ఎంపీపీ) బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి రోజంతా సందడిగా గడిపారు.