జుక్కల్​లో టెన్త్​ మ్యాథ్స్​​పేపర్​ లీక్?

 జుక్కల్​లో టెన్త్​ మ్యాథ్స్​​పేపర్​ లీక్?
  • సీఎస్, డిపార్ట్​మెంటల్​ ఆఫీసర్, ఇన్విజిలేటర్​ సస్పెన్షన్
  • కామారెడ్డి జిల్లా జుక్కల్​లో ఘటన

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా జుక్కల్  జడ్పీ హైస్కూల్​లో బుధవారం మ్యాథ్స్​ ఎగ్జామ్​ పేపర్​లోని కొన్ని ప్రశ్నలు పేపర్​పై  రాసి బయటకు పంపిన ఘటనపై అధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. ప్రాథమిక విచారణ అనంతరం సెంటర్​ చీఫ్​​సూపరింటెండెంట్​ ఎం.సునీల్( స్కూల్​ అసిస్టెంట్,​ డొంగ్లి), డిపార్ట్​మెంటల్​ ఆఫీసర్​ వి.భీమ్(స్కూల్​ అసిస్టెంట్,​ మద్నూర్​), ఇన్విజిలేటర్  సోమూర్​ను సస్పెన్షన్ ​​చేసినట్లు డీఈవో రాజు  తెలిపారు.

 జుక్కల్​ సెంటర్​లో ఎగ్జామ్​ రాస్తున్న  ఓ విద్యార్థి పేపర్​పై ప్రశ్నలు రాసి బయటకు పంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ తరువాత సోషల్​ మీడియాలో వైరల్​ చేసినట్లు  సమాచారం. విషయం తెలియడంతో కలెక్టర్​ ఆశిష్​​సంగ్వాన్​ ఎంక్వైరీకి ఆదేశించారు.  బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి,  డీఈవో రాజు,  ఇతర అధికారులు జుక్కల్​ వెళ్లి విచారణ చేపట్టారు. సీఎస్​, డీవో, ఇన్విజిలేటర్లు, స్టూడెంట్స్​తో మాట్లాడారు.  సోషల్  మీడియాలో వైరల్  చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.