
హైదరాబాద్, వెలుగు: స్విట్లర్లాండ్కు చెందిన టెంత్పిన్ మేనేజ్మెంట్కన్సల్టంట్స్ హైదరాబాద్లో బుధవారం ఏఐ ల్యాబ్స్ను అందుబాటులో తెచ్చింది. దీని ద్వారా లైఫ్సైన్సెస్ ఇండస్ట్రీకి ఏఐ ఆధారిత సొల్యూషన్స్ అందిస్తామని తెలిపింది. ఫార్మా, మెడ్టెక్, బయోటెక్, రీసెర్చ్ఆర్గనైజేషన్లకు ఏఐ అప్లికేషన్లను తయారు చేస్తామని పేర్కొంది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్టెంత్ఫిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను, ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెంత్పిన్ ఏఐ ల్యాబ్ హైదరాబాద్ లైఫ్సెన్సెస్ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ను బలోపేతం చేస్తుందన్నారు. త్వరలో లైఫ్సైన్సెస్ కంపెనీల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని వెల్లడించారు.