బీజేపీ నిర్మించిన టెర్మినల్స్ అండర్ పాస్, బ్రిడ్జ్ రోడ్లు అన్ని కూలిపోతున్నయ్ : ఎంపీ గడ్డం వంశీ

బీజేపీ నిర్మించిన టెర్మినల్స్ అండర్ పాస్, బ్రిడ్జ్ రోడ్లు అన్ని కూలిపోతున్నయ్ : ఎంపీ గడ్డం వంశీ

దేశ వ్యాప్తంగా అన్ని స్కాం లు బయట పడుతున్నాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. ఢిల్లీ, అయోధ్యలో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన టెర్మినల్స్ అండర్ పాస్, బ్రిడ్జ్ రోడ్లు అన్ని కూలిపోతున్నాయని విమర్శించారు.  నీట్ పరీక్షలు లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారని చెప్పారు. శ్రీధర్ బాబు సూచనలు తీసుకుంటూ పెద్దపల్లి అభివృద్ధికి పాటుపడుతానని.. పెద్దపల్లి అభివృద్ధి కోసం పార్లమెంట్ లో కొట్లడుతానని చెప్పారు. 

విజయోత్సవ ర్యాలీ, ఆత్మీయ సమ్మేళన సభ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కాక చేసిన సేవలను గుర్తుకు చేసుకుని తనను గెలిపించారని.. వాళ్లందరికీ రుణపడి ఉంటాను చెప్పారు గడ్డం వంశీ కృష్ణ