పెషావర్: పాకిస్తాన్లో టెర్రర్ అటాక్ చోటు చేసుకుంది. ఆర్మీ వాహనంపై మిలిటెంట్లు మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సోల్జర్లు చనిపోయారు. ఆదివారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దారాబన్ తహసీల్లో చోరీకి గురైన పారామిలిటరీ ట్రక్కును రికవరీ చేయడానికి సైనికులు మరో ట్రక్కులో బయలుదేరారు. ఈ క్రమంలో సైనికులపై టెర్రరిస్టులు మెరుపుదాడి చేశారు.
చనిపోయిన వారిలో నలుగురు పారా మిలిటరీ సిబ్బంది, ఓ సాధారణ పౌరుడు ఉన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, బలూచిస్తాన్లో టెర్రరిస్టుల కార్యకలాపాలను అరికట్టడానికి భద్రతా దళాలు దేశవ్యాప్తంగా యాంటీ టెర్రర్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే శనివారం బలూచిస్తాన్లో లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు వేర్వేరు ఆపరేషన్లు చేపట్టి 23 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టాయి.