అందరితో కలిసి డ్రగ్స్​పై పోరు : టీజీ న్యాబ్​ డైరెక్టర్​ సందీప్​ శాండిల్య

అందరితో కలిసి డ్రగ్స్​పై పోరు : టీజీ న్యాబ్​ డైరెక్టర్​ సందీప్​ శాండిల్య

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని టీజీ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్యా అన్నారు. పల్లె నుంచి పట్నం దాకా అన్ని విద్యాసంస్థలు, బస్తీలు, కాలనీల్లో 2 లక్షల మందితో అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్​, గంజాయిపై అవగాహన కార్యక్రమాల కోసం జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ సెంటర్​లో బుధవారం నాలుగు రోజుల శిక్షణ ప్రోగ్రామ్​ ప్రారంభమైంది. దీన్ని సందీప్ శాండిల్యా ప్రారంభించి మాట్లాడారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 940 మందికి ప్రస్తుతం శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు యువత, పేరెంట్స్​, టీచర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, డాక్టర్లు, ఆశావర్కర్లు, అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీలు, ఏఎన్ఎంలు, విలేజ్ అసిస్టెంట్లు సహా మొత్తం 2 లక్షల మందిని భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 4,511 ప్రహరీ క్లబ్బులు/యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా 16,477 విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపడ్తామన్నారు. విద్యాసంస్థలు,రద్దీ ప్రాంతాలు, కాలనీలు, బస్తీల్లో విస్తృతంగా పర్యటించి విద్యార్థులు, యువతలో అవగాహన కల్పిస్తామని సందీప్ శాండిల్యా తెలిపారు.