అప్పక్ పల్లిలో మెడికల్  కాలేజీ బిల్డింగ్​ను పరిశీలించిన ఇంజనీర్లు

అప్పక్ పల్లిలో మెడికల్  కాలేజీ బిల్డింగ్​ను పరిశీలించిన ఇంజనీర్లు

నారాయణపేట, వెలుగు: టీజీ ఎంఐడీసీ ఇంజనీర్ల బృందం నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మెడికల్  కాలేజీ బిల్డింగ్​ను పరిశీలించింది. అడిషనల్​ కలెక్టర్  అశోక్ కుమార్, మెడికల్  కాలేజీ ప్రిన్సిపాల్  రాంకిషన్ తో కలిసి టీజీ ఎంఐడీసీ చీఫ్  ఇంజినీర్  దేవేందర్ కుమార్, ఎస్ఈ సురేందర్ రెడ్డి, ఈఈ జైపాల్ రెడ్డి బిల్డింగ్​ను పరిశీలించి వివిధ విభాగాల ఏర్పాటు, అవసరమైన పరికరాలు, కల్పించాల్సిన సౌలతులపై చర్చించారు.

 కాలేజీ ప్రిన్సిపాల్​ కాలేజీ రోడ్డు, ప్రహారీ, మార్చురీ నిర్మాణం విషయాన్ని చీఫ్ ఇంజనీర్  దృష్టికి తీసుకువెళ్లారు.జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్  మల్లికార్జున్, టీజీ ఎంఐడీసీ డీఈ కృష్ణమూర్తి, ఏఈ సాయి మురారి పాల్గొన్నారు.