
ఆర్మూర్, వెలుగు : టీజీఏఎన్ బీ వారు డ్రగ్స్ నియంత్రణ కోసం రూపొందించిన అవగాహన పోస్టర్ను ఆదివారం ఆర్మూర్ లో ఆవిష్కరించారు. ఆర్మూర్ టౌన్ కు చెందిన సామాజిక సేవకులు పట్వారీ తులసీకుమార్, ఏసీపీ ఆఫీస్ లో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్సై శ్రీధర్ రెడ్డి తో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు.
ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు నిర్వహించే ఏ కార్యక్రమానికైనా తప్పకుండా సహకరిస్తామన్నారు. మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా విద్యార్థులు ఉన్నత చదువులు చదువాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.