లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్‌స్పెక్టర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్‌స్పెక్టర్

పాల్వంచ: భద్రాద్రి జిల్లా పాల్వంచ సబ్ స్టేషన్ లైన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇంటికి దొంగ కరెంట్ వాడుతున్నారని బాధితుడిని బెదిరించి వారి నుంచి రూ.26 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‪గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పాల్వంచ సబ్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.