జాతీయస్థాయిలో ఎన్పీడీసీఎల్ కు ఐదో ర్యాంక్ : ఎన్పీడీసీఎల్​సీఎండీ కర్నాటి వరుణ్​రెడ్డి వెల్లడి

జాతీయస్థాయిలో ఎన్పీడీసీఎల్ కు ఐదో ర్యాంక్ : ఎన్పీడీసీఎల్​సీఎండీ కర్నాటి వరుణ్​రెడ్డి వెల్లడి
  • మెరుగైన సేవలకు గుర్తింపుగా దక్కిన రేటింగ్

హనుమకొండ, వెలుగు: కన్స్యూమర్ సర్వీసింగ్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్(సీఎస్​ఆర్డీ)లో టీజీఎన్​పీడీసీఎల్​జాతీయస్థాయిలో  'ఏ' రేటింగ్ తో ఐదో ర్యాంక్​ సాధించింది.  కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సీఎస్​ఆర్డీ – 2023-, 24 ర్యాంకింగ్స్​ లో ఎన్​పీడీసీఎల్​చోటు దక్కించుకుంది.

వినియోగదారులకు సత్వర సర్వీసుల మంజూరు,  మీటరింగ్, బిల్లింగ్ ప్రక్రియ స్పీడప్ , కంప్లయింట్ల పరిష్కారం, జవాబుదారీతనం, కార్యాచరణలో ముందుండడం వంటి సేవలతో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ వచ్చినట్టు ఎన్పీడీసీఎల్​సీఎండీ కర్నాటి వరుణ్​ రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. సంస్థ పరిధిలో వినియోగదారులకు  మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు.  సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.