
ఇబ్బందులు రాకుండా 16 సర్కిళ్లలో రూ.600 కోట్లతో పనుల ప్లాన్
ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే సాల్వ్ చేసేలా రెడీ
హనుమకొండ, వెలుగు: వేసవి నేపథ్యంలో విద్యుత్ వాడకం పెరుగుతోంది. వచ్చే మూడు నెలల పాటు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అంతరాయం లేకుండా కరెంట్సరఫరా చేయాలనే లక్ష్యంగా తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్) రెడీ అయింది. సంస్థ పరిధిలోని 16 సర్కిళ్లలో దాదాపు రూ.600 కోట్లతో ‘ సమ్మర్ యాక్షన్ ప్లాన్’ చేపట్టింది.
రికార్డు స్థాయిలో కరెంట్ వాడకం
టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు ఉన్నాయి. డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.68.34 లక్షలు, వ్యవసాయానికి రూ.12.2 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
రోజుకు సగటున 4 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుండగా.. వేసవిలో మరింతగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత నెల 5న తొలిసారి 15,752 మెగావాట్ల రికార్డు స్థాయి డిమాండ్ ఏర్పడింది. ఎన్పీడీసీఎల్పరిధిలో 5,328 మెగావాట్లుగా నమోదైంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో సగటున 5,600 వరకు డిమాండ్ ఉంటోంది. యాసంగిలో పంటల సాగు కారణంగా మార్చి, ఏప్రిల్లో 17వేల మెగావాట్లకు చేరుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు.
రూ.600 కోట్లతో పనులు షురూ
టీజీఎన్పీడీసీఎల్పరిధిలో సాధారణ రోజుల్లో సగటున 4వేల మెగావాట్ల వరకు కరెంట్ డిమాండ్ నమోదవుతోంది. మార్చి, ఏప్రిల్, మే కూడా డిమాండ్ మరింత పెరిగే చాన్స్ ఉంది. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ ముందస్తు యాక్షన్ ప్లాన్ చేపట్టింది. రూ.600 కోట్ల అంచనాతో పనులకు శ్రీకారం చుట్టింది. 16 సర్కిళ్ల పరిధిలో దాదాపు రూ.150 కోట్లతో కొత్త సబ్ స్టేషన్లతో పాటు పాత సబ్స్టేషన్ల పునరుద్ధరణ, రూ.150 కోట్లతో కొత్త ఫీడర్స్ పనులను అధికారులు చేపట్టారు.
క్షేత్రస్థాయిలో ఓవర్లోడ్ట్రాన్స్ఫార్మర్లపై భారం తగ్గించేలా సుమారు రూ.190 కోట్లతో కొత్తగా 3,954 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు(డీటీఆర్), 105 పవర్ట్రాన్స్ఫార్మర్లు(పీటీఆర్) ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 33కేవీ లైన్లు, 11కేవీ లైన్లు ఇంటర్లింకింగ్ పనులు కూడా పూర్తి చేశారు.
ప్రతి పోల్ కు జియో ట్యాగింగ్
వేసవిలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడితే వెంటనే సాల్వ్ చేసేలా.. ప్రతి పోల్కు యూనిక్నంబరింగ్ ఇచ్చి, అస్సెట్ మ్యాపింగ్లో భాగంగా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 33కేవీ, 11 కేవీ అన్నీ కలిపి 7,367 ఫీడర్లలో చేపట్టగా.. మార్చిలోపు ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఆ పోల్నంబర్ ను ట్రేస్ చేసి వెంటనే వెళ్లి తగిన చర్యలు తీసుకునే చాన్స్ ఉంటుందని పేర్కొంటున్నారు.
త్వరగా వెళ్లేందుకు జీపీఆర్ఎస్ సిస్టంతో ఎమర్జెన్సీ రీస్టోర్ టీమ్(ఈఆర్టీ) వెహికల్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సబ్స్టేషన్ల రియల్టైమ్ మానిటరింగ్సబ్ స్టేషన్లలో సమస్యలను ఐడెంటీఫై చేసేలా రియల్ టైమ్ డేటా మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో 100 సబ్ స్టేషన్లు గుర్తించి, ఈరోజు నుంచి పనులు ప్రారంభిస్తున్నారు.
ఆసిఫాబాద్ సర్కిల్లో 19, ములుగు డివిజన్ లో 18, ఖమ్మం రూరల్లో 24, వైరాలో14, కాటారం సబ్ డివిజన్ లో 10, గ్రేటర్ వరంగల్ పరిధిలో 15 సబ్ స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా వోల్టేజ్ లో హెచ్చుతగ్గులు, ఇతర లోపాలు తలెత్తినా వెంటనే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అలర్ట్ మెసేజ్వెళ్తుంది. అక్కడి సమస్యలను మానిటరింగ్ చేయొచ్చని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. సమ్మర్లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు వచ్చినా 1912 టోల్ ఫ్రీ నంబర్ కాల్చేస్తే వెంటనే యాక్షన్చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
అంతరాయాలు రాకుండా విద్యుత్ సరఫరా చేస్తాం.
ఎన్పీడీసీఎల్ పరిధిలో వ్యవసాయ పనులతో మార్చిలోనే ఎక్కువ డిమాండ్ వచ్చే చాన్స్ ఉంటుంది. ఏప్రిల్, మే లో పట్టణాల్లో డిమాండ్పెరుగుతుంది. ఎంత ఉన్నా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తాం. సబ్ స్టేషన్లలో రియల్టైం డేటా మానిటరింగ్ సిస్టంను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. నిరంతరం విద్యుత్ అందించేందుకు సమ్మర్యాక్షన్ప్లాన్ మేరకు తగు చర్యలు తీసుకుంటాం. -కర్నాటి వరుణ్రెడ్డి, సీఎండీ, టీజీఎన్పీడీసీఎల్