గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు TGPSC బిగ్ అలర్ట్

గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు TGPSC బిగ్ అలర్ట్

హైదరాబాద్:  గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. 2024, అక్టోబర్ 21వ తేదీ నుండి జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్స్ టికెట్స్‎ను 2024, అక్టోబర్ 14వ తేదీ నుండి అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఇవాళ (2024, అక్టోబర్ 9) ఒక ప్రకటనలో తెలిపారు. టీజీపీఎస్సీ  అధికారిక వెబ్ సైట్ నుండి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాలని సూచించింది.

ALSO READ | వచ్చి.. మీ ఉద్యోగ నియామక పత్రం తీసుకోండి: డీఎస్సీ క్యాండిడేట్స్‎కు ఫోన్ కాల్

ఈ నెల 21 తేదీ నుండి 27వ తేదీ వరకు గ్రూప్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 నుండి అభ్యర్థులను సెంటర్స్ లోపలికి అనుమతిస్తామని.. మధ్యాహ్నం 1.30కు పరీక్ష  కేంద్రాల గేట్లు క్లోస్ చేయబడతాయని అభ్యర్థులకు సూచించారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టీజీపీఎస్సీలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.