
హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ గతేడాది అక్టోబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి. అభ్యర్థికి వచ్చిన ప్రొవిజినల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ అధికారికంగా వెల్లడించనుంది.
మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం 2024 జూన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా.. వారిలోంచి మెయిన్స్ కు 31,403 మంది ఎంపికయ్యారు. వారికి అక్టోబర్ 21 నుంచి 27 వరకూ పరీక్షలు నిర్వహించగా.. 21,093 మంది అటెండ్ అయ్యారు. వీరందరికీ వచ్చిన మార్కులను టీజీపీఎస్సీ సోమవారం ప్రకటించనుంది. ఈ మార్కులతో ఎవరికి జాబ్ వచ్చే అవకాశం ఉందనేది దాదాపు స్పష్టం కానున్నది. కాగా, మంగళవారం గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా రిలీజ్ కానుంది.