గ్రూప్ 2 పరీక్ష వాయిదా : TGPSC అధికారిక ప్రకటన

గ్రూప్ 2 పరీక్ష వాయిదా : TGPSC అధికారిక ప్రకటన

రాష్ట్రంలో తెలంగాణ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 పరీక్ష ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ వేరకు టీజీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని TGPSC స్పష్టంచేసింది.  పరీక్షల తేదీలో త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాలి. అయితే గ్రూప్-2 పరీక్ష సమయంలో ఇతర పరీక్షలు ఉండటంతో వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్-2 వాయిదా వేయాలని నిర్ణయించింది. 

గత కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్షలు కూడా అదే సమయంలో ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన చేస్తుండగా ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్ 2022 డిసెంబర్ లో 783 పోస్టులతో విడుదలైంది. పలు కారణాల వల్ల ఇప్పటి దాకా మూడు సార్లు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. 5.51 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.