గోల్కొండ బోనాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు

గోల్కొండ బోనాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు

హైద్రాబాద్‌లో ఆషాఢమాస బోనాల జాతర ప్రత్యేక బస్సులను నడపనున్న టిజిఎస్ ఆర్టీసీ ప్రకటించింది. జులై 7 న (ఆదివారం) జరగనున్న గోల్కొండ బోనాల జాతర కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన ఏరియాల నుంచి గోల్కొండ కోటకు 75 స్పెషల్ సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు హైద్రాబాద్ జోన్ ఈడీ వేంకటేశ్వర్లు వెల్లడించారు. గోల్కొండ బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్పెషల్ బస్సుల ఆపరేట్ చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

సికింద్రాబద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్, ఈసీ ఐయల్, కూకటిపల్లి, కేపీహెచ్బి, పఠాన్ చెరువు, రాజేంద్రనగర్, హయత్ నగర్, దిలీషుక్నగర్, మెహదీపట్నం, రాంనగర్, చార్మినార్, ఉప్పల్, ఓల్డ్ బోయినపల్లి, మల్కజిగిరి వంటి ప్రధాన రూట్ లనుండి గోల్కొండకోటకు బస్సులు ఆదివారం బస్సులు నడుస్తాయి.