శివరాత్రి స్పెషల్: హైదరాబాద్ నుంచి కీసరగుట్ట, ఏడుపాయలకు స్పెషల్ బస్సులు

శివరాత్రి స్పెషల్:  హైదరాబాద్ నుంచి కీసరగుట్ట, ఏడుపాయలకు స్పెషల్ బస్సులు

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకి టలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు. తెలంగాణ  వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు శైవ క్షేత్రాలకు పొటెత్తుతారు

 ఈ క్రమంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని  ప్రముఖ ఆలయాలకు  ఫిబ్రవరి 25 నుంచి 28 వ తేదీ వరకు స్పెషల్  బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్  నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు  తెలిపింది. 

స్పెషల్ బస్సులు ఇలా..

  • సికింద్రాబాద్ (రెజిమెంటల్ బజార్) నుంచి 90 బస్సులు ,ECIL X రోడ్డు నుంచి 100, , అమ్ముగూడ నుంచి 70, ఉప్పల్ X రోడ్ నుంచి   కీసరకు మొత్తం 285 బస్సులు నడుస్తాయి
  • సీబీఎస్ నుంచి  ఏడుపాయల జాతరకు  మొత్తం 125 బస్సులు నడవనున్నాయి. 
  • బీరంగూడ నుంచి పటాన్ చెరుకు మొత్తం 30 బస్సు సర్వీసులను నడుపనున్నారు