చివరి దశలో తల్లి మనసు షూటింగ్

చివరి దశలో తల్లి మనసు షూటింగ్

సీనియర్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో  ఆయన కొడుకు ముత్యాల అనంత కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘తల్లి మనసు’. వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని తెలియజేశారు నిర్మాత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మిగతా టాకీ పార్ట్‌‌తో పాటు ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. 

ఈ నెలాఖరుకు మొత్తం షూటింగ్ ముగుస్తుంది. సింగిల్ షెడ్యూల్‌‌లో షూటింగ్ పూర్తి చేస్తున్నాం’ అని చెప్పారు.  ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే చక్కటి కుటుంబ కథా చిత్రమిదని,  ఆమె మనోవేదన, సంఘర్షణను ఇందులో చూపించనున్నట్టు దర్శకుడు సిప్పీ తెలియజేశాడు. రఘుబాబు, శుభలేఖ సుధాకర్, దేవీప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.