రతన్ టాటా లాస్ట్ ట్వీట్ ఇదే.. ఏమన్నారంటే..

రతన్ టాటా లాస్ట్ ట్వీట్ ఇదే.. ఏమన్నారంటే..

ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం, ఇండియన్ ఐకాన్ రతన్ టాటా మృతితో భారతావని శోకసంద్రంలో మునిగింది. ఇటీవల బీపీ లెవెల్స్ పడిపోవటంతో ఆసుపత్రిలో చేరిన టాటా బుధవారం ( అక్టోబర్ 9,2024 ) ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. టాటా మృతి పట్ల సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో రతన్ టాటా లాస్ట్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో తప్పుడు కధనాలు వచ్చిన నేపథ్యంలో సోమవారం ( అక్టోబర్ 7, 2024 ) చేసిన ట్వీట్ టాటా ఆఖరి ట్వీట్ అయ్యింది.

 

మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలపై స్పందిస్తూ నా గురించి ఆలోచించినందుకు థ్యాంక్స్ అంటూ ఎక్స్ లో ఓ నోట్ రిలీజ్ చేశారు టాటా. నా ఆరోగ్యం గురించి ఇటీవల వచ్చిన పుకార్లు నిరాధారమైనవని అందరికీ తెలియజేస్తున్నానంటూ పేర్కొన్నారు టాటా. నా వయస్సు మరియు సంబంధిత వైద్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానని... నేను మంచి ఉత్సాహంతో ఉన్నానని.. ప్రజలు, మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని నేను అభ్యర్థిస్తున్నానంటూ.. తన లాస్ట్ ట్వీట్ లో పేర్కొన్నారు రతన్ టాటా.

ALSO READ | టాటా గ్రూపులో రతన్ ప్రస్థానం : అసిస్టెంట్ ఉద్యోగం నుంచి చైర్మన్ వరకు ఇలా ఎదిగారు