సింగరేని సీఎండీగా శ్రీధర్​ కొనసాగింపునకు కేంద్రం నో

సింగరేని సీఎండీగా శ్రీధర్​ కొనసాగింపునకు కేంద్రం నో
జనరల్ బాడీ మీటింగ్ లో రిజల్యూషన్ ను వ్యతిరేకించిన కోల్ మినిస్ట్రీ ప్రతినిధి ఆర్డినరీ తీర్మానంగా మార్చి పాస్ చేయించుకున్న రాష్ట్ర సర్కారు రూల్స్​ ప్రకారం ఇది చెల్లదంటున్న ఎక్స్​పర్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి సీఎండీగా ఐఏఎస్​ ఆఫీసర్​ ఎన్.శ్రీధర్​ను కంటిన్యూ చేసేందుకు కేంద్రం నో చెప్పింది. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో బుధవారం జరిగిన యాన్యువల్​ జనరల్​ బాడీ మీటింగ్ ఇందుకు వేదికైంది. ఇప్పటికే సీఎండీగా ఆరేండ్లు పూర్తి చేసుకున్న శ్రీధర్​ను మళ్లీ కొనసాగించేందుకు పెట్టిన తీర్మానాన్ని సెంట్రల్​ కోల్​మినిస్ట్రీ ప్రతినిధి ఆల్క శేఖర్ ​వ్యతిరేకించారు. అయితే అదే టైంలో స్టేట్​ గవర్నమెంట్​ స్పెషల్​ రిజల్యూషన్​ను ఆర్డినరీ తీర్మానంగా మార్చి.. కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, కంపెనీ సెక్రటరీ, స్టేట్​ ఎనర్జీ డిపార్ట్​మెంట్​కు చెందిన ఆఫీసర్​ ఐలయ్య సాయంతో పాస్​ చేయించుకుంది.కానీ ఈ తీర్మానం చెల్లదని సీఎండీ పదవి నుంచి శ్రీధర్​దిగిపోవాల్సిందేనని ఎక్స్​పర్ట్స్​చెప్తున్నారు. రెండు గంటలకుపైగా జనరల్​బాడీ మీటింగ్ సింగరేణి కాలరీస్​ కంపెనీ యాన్యువల్​జనరల్​బాడీ మీటింగ్​దాదాపు రెండు గంటలకుపైగా సాగింది. ఇందులో కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, స్టేట్​ఎనర్జీ డిపార్ట్​మెంట్​కు చెందిన ఆఫీసర్​ ఐలయ్య, సెంట్రల్​ కోల్​మినిస్ట్రీ నుంచి ఆల్క శేఖర్​తోపాటు కంపెనీ సెక్రటరీ పాల్గొన్నారు. 2019–20 ఫైనాన్షియల్​ఇయర్​కు సంబంధించిన ఈ యాన్యువల్​ జనరల్​బాడీ మీటింగ్​లో.. తొమ్మిది తీర్మానాలకుగాను ఎనిమిది ఆమోదం పొందగా, సీఎండీ జీతభత్యాలు, ఇతర అలవెన్సులకు సంబంధించిన తీర్మానాన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది. స్టేట్, సెంట్రల్​లకు చెల్లించే డివిడెండ్, సెస్, ఇతర ఫైనాన్షియల్ అంశాలపైనా చర్చించాక.. సీఎండీగా శ్రీధర్​ను కొనసాగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రతినిధిగా కోల్​ మినిస్ట్రీ నుంచి హాజరైన ఆల్క శేఖర్​ దానిని వ్యతిరేకించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ స్పెషల్​ రిజల్యూషన్​ను ఆర్డినరీ తీర్మానంగా మార్చి.. కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, కంపెనీ సెక్రటరీ, స్టేట్ ఎనర్జీ డిపార్ట్​మెంట్​కు చెందిన ఆఫీసర్​ ఐలయ్య సాయంతో పాస్​చేయించుకుంది. వాస్తవానికి తీర్మానానికి అనుకూలంగా 70 శాతం ఓట్లు పడాలి. సింగరేణిలో సెంట్రల్​వాటా 49 శాతం కావడంతో.. కోల్​మినిస్ట్రీ ప్రతినిధికి అంతే శాతం ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి తీర్మానం వీగినట్టేనని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. ట్రైపార్టెడ్​ అగ్రిమెంట్​ ప్రకారం సీఎండీని కొనసాగించాలంటే.. కోల్​ మినిస్ట్రీ పర్మిషన్​ తీసుకోవాలని  గుర్తు చేస్తున్నారు. స్పెషల్​ రిజల్యూషన్​ను ఆర్డినరీ తీర్మానంగా మార్చాలన్నా.. 14 రోజుల ముందే కోల్​ మినిస్ట్రీ ఆమోదం తప్పనిసరని.. ఇలా ఏరకంగా చూసినా సీఎండీ శ్రీధర్​పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. సింగరేణి చరిత్రలోనే ఫస్ట్​ టైం సీఎండీ కొనసాగింపుపై రాష్ట్రం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కోల్​మినిస్ట్రీ వ్యతిరేకించడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటి సారని అధికారవర్గాలు చెప్తున్నాయి. 2015 జనవరి 1న బాధ్యతలు చేపట్టిన శ్రీధర్  పదవీకాలం నిజానికి 2016  డిసెంబర్ 31నే ముగిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా ఆరేండ్లుగా కొనసాగిస్తూ వస్తోంది. అధికారులెవరైనా రూల్స్​ ప్రకారం ఐదేండ్లకు మించి ఈ పదవిలో ఉండరాదు. అయినా మరోసారి శ్రీధర్​ పదవిని పొడిగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తోంది. సీఎండీ శ్రీధర్​ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వస్తున్నాయి. తెలంగాణ జెన్​కో, ట్రాన్స్​కో నుంచి సింగరేణికి 11 వేల కోట్లకుపైగా రావాల్సి ఉన్నా.. రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తేవకపోవడం, డీఎంఎఫ్​టీ పేరిట సుమారు రూ.2 వేల కోట్లకుపైగా ఫండ్స్​ను రాష్ట్ర ఖజనాకు మళ్లించడం, కంపెనీలో డీజిల్​, ఓబీ కుంభకోణాలు, ఇతర అవినీతి, అక్రమాలు బయటపడ్తుండటంతో శ్రీధర్​ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కంపెనీ సెక్రటరీగా పనిచేసిన ఆఫీసర్.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల ఆప్మెల్​కు ట్రాన్స్​ఫర్​ చేయడం వివాదాస్పదమైంది. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మాటలకు కూడా సీఎండీ శ్రీధర్​ విలువ ఇవ్వడం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో శ్రీధర్​పై కేంద్రం ఆగ్రహంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది.