తొలి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్​

తొలి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్​

సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూ.2500 కోట్లతో గోవా నౌకా నిర్మాణ కేంద్రం(జీఎస్​ఎల్​) నిర్మించిన ప్రత్యేక నౌక సముద్ర ప్రతాప్​ను రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్​సేథ్​ ఇండియన్​ కోస్ట్​ గార్డ్​కు అప్పగించారు. ఇందులో 72శాతం నిర్మాణ పనులు ఆత్మనిర్భర్​ భారత్​ కింద దేశీయంగానే పూర్తిచేశారు. అవాంఛిత శక్తుల నుంచి సముద్ర తీరాన్ని కాపాడటంలో కోస్ట్​ గార్డ్​ కీలక పాత్ర పోషిస్తున్నది. 

సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, అందులోనూ ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జల చరాలను కాపాడేందుకు దోహదపడేలా అధునాతన సాంకేతికత ఈ నౌకలో ఉంది. ఈ నౌక పొడవు 114.5 మీటర్లు, వెడల్పు 16.5 మీటర్లు ఉంటుంది. 4170 టన్నుల వరకు స్థానభ్రంశం చెందుతుంది. ఇందులో 14 మంది అధికారులు, 115 మంది నావికులు ఉండనున్నారు. 

ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ కోసం రూ.583 కోట్లతో రెండు కాలుష్య నియంత్రణ నౌకలను నిర్మించడానికి గోవా షిప్​ యార్డ్​ లిమిటెడ్​ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నౌకలను స్వదేశీ పద్ధతిలో నిర్మించడం ఇదే తొలిసారి.