![జనసేన ప్రభుత్వం ఏర్పడగానే పెట్టే మొదటి మూడు సంతకాలు](https://static.v6velugu.com/uploads/2019/03/Pawan-Kalyan_Janasena_-Cut.jpg)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రభుత్వం రైతులకు, మహిళలకు ,నిరుద్యోగులకు పెద్ద పీఠ వేస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంతకం ఎకరానికి రైతులకు రూ. 8 వేలు సాయం, పెన్షన్ రూ. 5 వేలు. రెండవ సంతకం మహిళలకు నెలకు రూ.2500 నుంచి3500 నగదు బదిలీ పథకం, మూడవ సంతకం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ పై సంతకం చేస్తామని ప్రకటించారు.