
ఓస్లో: ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత విమానం రన్ వేపై నుంచి స్కిడ్ అయింది. నార్వేలోని ఓస్లో టార్ప్ సాండెఫ్ జోర్డ్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ విమానం ఓస్లో నుంచి ఆమ్ స్టర్ డామ్వెళ్లేందుకు టేకాఫ్ అయింది. ఆ తర్వాత కాసేపటికే ఫ్లైట్లో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఓస్లో ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్చేశారు. ల్యాండ్ అయిన తర్వాత విమానం రన్ వేపై నుంచి స్కిడ్ అయి ట్యాక్సీవే వరకు వెళ్లి ఆగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 182 మంది ఉన్నారు.