గోదావరి తగ్గుముఖం.. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

 గోదావరి తగ్గుముఖం.. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద శుక్రవారం గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. గురువారం రాత్రి 45.5 అడుగులకు చేరుకున్న నీటి మట్టం తర్వాత నిలకడగా మారింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 42.1 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.