
హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ పట్టింది. రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను మంజూరు చేసింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామాల్లో1,323 కి.మీ మేర కొత్త రహదారుల నిర్మాణ పనుల కోసం రూ.1,377.66 కోట్లను రిలీజ్చేసింది. మరోవైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క థ్యాంక్స్చెప్పారు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. సీఆర్ఆర్ రోడ్ల కోసం మరో రెండు, మూడు రోజుల్లోనే రూ. 400 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.