సీఎంవోలోకి జయేశ్.. స్మితాపై బదిలీ వేటు.. రాష్ట్రంలో 20 మంది IAS​ అధికారుల బదిలీ

సీఎంవోలోకి జయేశ్.. స్మితాపై బదిలీ వేటు.. రాష్ట్రంలో 20 మంది IAS​ అధికారుల బదిలీ
  • రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్​ అధికారుల బదిలీ
  • పరిశ్రమల శాఖ స్పెషల్​ సీఎస్​గా సంజయ్​ కుమార్​
  • స్మితాపై బదిలీ వేటు.. టూరిజం నుంచి ఫైనాన్స్​ కమిషన్‎కు..
  • జీహెచ్​ఎంసీ కమిషనర్​గా ఆర్.వి.కర్ణన్​
  • హెచ్ఎండీఏ లిమిట్స్​ సెక్రటరీగా ఇలంబర్తి 
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పరిపాలనలో కొత్త ఊపు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 20 మంది ఐఏఎస్‎ల బదిలీలు, పోస్టింగ్​చేపడుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. చాలాకాలం పాటు ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంట్​స్పెషల్​సీఎస్‎గా ఉన్న జయేశ్​రంజన్‎ను ప్రభుత్వం సీఎంవోలోకి తీసుకున్నది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇండస్ట్రీస్​అండ్​ఇన్వెస్ట్​మెంట్​సెల్​సీఈవోగా, స్పెషల్​సీఎస్‎గా ఆయనకు పోస్టింగ్​ఇచ్చింది. సీఎంవోలో కొత్తగా ఇండస్ట్రీస్​అండ్​ఇన్వెస్ట్​మెంట్​సెల్‎ను ఏర్పాటు చేశారు.

దీంతోపాటు స్మార్ట్​ ప్రొయాక్టివ్​ఎఫిషియెంట్​అండ్​ఎఫెక్టివ్​ డెలివరీ (స్పీడ్​) బాధ్యతలు కూడా జయేశ్​రంజన్‎కు అప్పగించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో వివాదాస్పద ట్వీట్లు పెట్టిన స్మితా సబర్వాల్​పైన బదిలీ వేటు పడింది. ఆమెను యువజన వ్యవహారాలు, టూరిజం శాఖ నుంచి తీసేసి రాష్ట్ర ఫైనాన్స్​కమిషన్​మెంబర్ సెక్రటరీగా నియమించింది. 

అంతకుముందు స్మితా సబర్వాల్​ఇదే పోస్టులో పనిచేశారు. యువజన వ్యవహారాలు, టూరిజం, సాంస్కృతిక శాఖ అదనపు బాధ్యతలను జయేశ్​రంజన్‎కు ప్రభుత్వం అప్పగించింది. సీనియర్​ ఐఏఎస్​సంజయ్ కుమార్‎ను పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, క్రీడల శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా  నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‎గా ఆర్.వి కర్ణన్​నియమితులయ్యారు . 

ఎఫ్​సీడీఏ కమిషనర్‌‌‌‌గా కె.శశాంక 

ఫ్యూచర్ సిటీ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (ఎఫ్​సీడీఏ) కమిషనర్‌‌‌‌గా కె. శశాంక బదిలీ అయ్యారు. జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌గా ఉన్న ఇలంబర్తి మెట్రో పాలిటన్ ఏరియా అండ్​అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ (హెచ్ఎండీఏ) సెక్రటరీగా, మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్​​అండ్​ అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ ప్రిన్సిపల్​సెక్రటరీగా ఉన్న దాన కిషోర్​ను కార్మిక, శిక్షణ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే గవర్నర్‌‌‌‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్​ కొనసాగనున్నారు. 

కీలక విభాగం చూస్తున్న దాన కిషోర్​పై బదిలీ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎంసీహెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీ ఇన్‌‌‌‌స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌‌‌‌గా శశాంక్​ గోయల్..​ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌‌‌‌గా బదిలీ అయ్యారు. ఈపీటీఆర్‌‌‌‌ఐ డైరెక్టర్ జనరల్ పోస్టుకు అదనపు బాధ్యతలు చూడనున్నారు. ​జెన్ కో సీఎండీగా హరీశ్​ను ప్రభుత్వం నియమించింది. ఐ అండ్​ పీఆర్ స్పెషల్​ కమిషనర్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.