భద్రాచలం హుండీ ఆదాయం రూ.1.21కోట్లు

భద్రాచలం హుండీ ఆదాయం రూ.1.21కోట్లు

భద్రాచలం,వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం హుండీ ని లెక్కించారు. జూన్​ 12న నుంచి సోమవారం వరకు రూ.1కోటి 21లక్షల 44వేల 579లు నగదు వచ్చింది. 104 గ్రాముల బంగారం, 805 గ్రాముల వెండి హుండీల్లో వచ్చాయి. 183 అమెరికా డాలర్లు, 1000 మయన్మార్​ క్యాట్స్, 3 ఖతార్​ రియాన్స్, 50 కెనడా డాలర్స్, 10 నేపాల్​ రూపీస్​ ఫారన్​ కరెన్సీ వచ్చినట్లు ఈఓ రమాదేవి వెల్లడించారు. సీసీ కెమెరాల నిఘాలో హుండీలనె తెరిచి లెక్కించారు. కాగా భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.