హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు ! : ప్రభుత్వం కొత్త ఆలోచన

హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు ! : ప్రభుత్వం కొత్త ఆలోచన

హైదరాబాద్ సిటీలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం, సాయంత్రం సమయాల్లో కాలనీల్లోనూ ట్రాఫిక్ జాం అవుతుంది. వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నది. ఈ క్రమంలోనే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు.. వాహనాలు సాఫీగా సాగేందుకు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నది. 

2024, సెప్టెంబర్ 13వ తేదీన... హైదరాబాద్ సిటీలో ఫుత్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, పరిశుభ్రత, ట్రాఫిక్ అంశాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయటంలో.. ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి అవకాశాలను కల్పించే అంశంపై పరిశీలన చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 

ALSO READ | సీఎం రేవంత్ రెడ్డితో బాలయ్య చిన్న కుమార్తె భేటీ

ట్రాఫిక్ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్ జెండర్ల వివరాలు సేకరించాలని.. వారి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ అండ్ బీ టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దన్నారు సీఎం. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారాయన. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15రోజుల్లోగా అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తప్పుడు రిపోర్ట్ లు ఇస్తే అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.