స్టూడెంట్​ను బలిచ్చిన స్కూల్ యజమాని

స్టూడెంట్​ను బలిచ్చిన స్కూల్ యజమాని
  • యూపీలోని హత్రాస్​లో ఘోరం

హత్రాస్: స్కూల్ డెవలప్ కావాలని క్షుద్ర పూజలు చేసిన యజమాని.. అందులో భాగంగా ఓ విద్యార్థిని బలిచ్చాడు. రెండో క్లాస్ చదుతువున్న పిల్లాడిని హాస్టల్​లోనే ప్రాణం తీశారు. వారం కింద ఉత్తరప్రదేశ్​ హత్రాస్​లోని ఓ ప్రైవేటు స్కూల్​లో జరిగిన ఈ దారుణం శుక్రవారం బయటపడింది. చిన్నారిని చంపేసిన డైరెక్టర్ జసోధన్ సింగ్​తో పాటు అతడి కొడుకు దినేశ్ బాఘేల్, మరో ముగ్గురి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ అనుకున్నంతగా డెవలప్ కావడంలేదని యజమాని జశోధన్ సింగ్ అతడి కొడుకు దినేశ్​ బాఘెల్​కిందటి వారం క్షుద్ర పూజలు చేయించారు.

నరబలి ఇస్తే స్కూలు దశ తిరుగుతుందని భావించి హాస్టల్​ లో ఉంటున్న కృతార్థ్ అనే రెండో తరగతి విద్యార్థిని దీనికోసం ఎంచుకున్నారు. ప్లాన్ ప్రకారం కృతార్థ్ ను ఈ నెల 23న హాస్టల్ నుంచి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, నిద్రలో నుంచి మేల్కొన్న కృతార్థ్.. భయంతో కేకలు వేశాడు. దీంతో కృతార్థ్​ను అక్కడే గొంతు నులిమి చంపేశారు. కొడుకు చనిపోయాడన్న సమాచారంతో హాస్టల్​కు వచ్చిన కృతార్థ్ తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 
దర్యాఫ్తు చేయగా.. నరబలి విషయం బయటపడింది.