కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కన్నారానికి చోటేది ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు నిరాశే ఎదురైంది.

కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కన్నారానికి  చోటేది  ఉమ్మడి  కరీంనగర్ ప్రజలకు నిరాశే ఎదురైంది.
  • ప్రసాద్ స్కీమ్ లో జిల్లా ఆలయాలకు దక్కని చోటు
  •  ప్రస్తావన లేని ఐఐటీ,  నవోదయ విద్యాసంస్థల
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

కరీంనగర్, వెలుగు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లావాసులకు నిరాశే మిగిలింది.  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గానికి ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు నిధులు రాకపోగా.. ఏళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని తెలిసింది.  ఆలయాల అభివృద్ధికి అమలు చేస్తున్న ప్రసాద్ స్కీమ్ లో వేములవాడ, కొండగట్టులాంటి ప్రముఖ ఆలయాలకు చోటు దక్కలేదు. కరీంనగర్ లో ఐఐటీ, కొత్త జిల్లాలకు నవోదయ విద్యాసంస్థలు వస్తాయనుకున్న ఉమ్మడి జిల్లావాసులకు ఈ సారి కూడా నిరాశ తప్పలేదు.  సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ టెక్స్ టైల్ క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తారని భావించినా ఆ ప్రస్తావనే లేదు. 

 

  • ఆలయాలకు దక్కని ‘ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’


లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మే 7న కరీంనగర్  లోక్ సభ పరిధిలోని వేములవాడ వచ్చారు. అక్కడ రాజన్న ఆలయాన్ని  సందర్శించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్ లో చేర్చి అభివృద్ధి చేస్తారని అంతా ఆశించారు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ కూడా ప్రసాద్ స్కీమ్ లో వేములవాడను చేరుస్తామని, ఇదే స్కీమ్ లో రామాయణ సర్క్యూట్ కిందికి కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ఇటీవల ప్రకటించారు. కానీ  కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్​ తన ప్రసంగంలో బిహార్ లోని విష్ణుపాద, మహాబోధి,  మునిసువ్రత ఆలయాలను, ఒడిశాలోని మరికొన్ని  ఆలయాలను ప్రస్తావించినప్పటికీ తెలంగాణలోని ఆలయాల గురించి మాట్లాడలేదు.  

  • పేదల ఆశలపై నీళ్లు చల్లారు

రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో బీజేపీ ఎంపీలు నిర్లక్ష్యం వహించారు.  కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చి, పేదలకు నిరాశ కలిగించేలా మోదీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి వారి పార్టీ విధానాన్ని మరోసారి ప్రకటించింది. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు సహా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిధుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి రాష్ట్ర అభివృద్ధి విషయంలో వారికున్న చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టమైంది. 
- డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు