డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్

డబ్బులు ఇవ్వాలని  కౌన్సిలర్ భర్త  బ్లాక్​మెయిల్
  •     పోలీసులకు రియల్టర్​ ఫిర్యాదు
  •     నిందితుడి అరెస్ట్, రిమాండ్​కు తరలింపు

భైంసా, వెలుగు :  డబ్బులివ్వాలని రియల్టర్​ను బ్లాక్​మెయిల్​చేసిన కౌన్సిలర్​భర్తను అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. భైంసా పట్టణానికి చెందిన రియల్టర్ కె.అరవింద్ గతంలో రాహుల్ నగర్​లో కొంత భూమిని కొని, అందులో ప్లాట్లు వేశాడు. వాటిని అమ్మే క్రమంలో బీజేపీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్ అనిత భర్త బాలాజీ సుత్రావే.. అరవింద్​ను బ్లాక్​ మెయిల్​ చేశాడు. వెంచర్ నిబంధనల ప్రకారం లేదని, ఎవరూ ప్లాట్లు కొనకుండా చేస్తానని బెదిరించాడు.

సబ్ రిజిస్టర్ ఆఫీస్​లో కంప్లైంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ జరగకుండా చేశాడని, తమకు పర్సంటేజ్ ఇవ్వాలని బ్లాక్​ మెయిల్​కు పాల్పడి రూ.20 లక్షలు డిమాండ్​ చేశాడు. చివరకు రూ.10 లక్షలు ఇచ్చాడు. ప్రస్తుతం నేతాజీ నగర్​లో బాధితుడు అరవింద్ ఓ ల్యాండ్ కొని డెవలప్ చేసే క్రమంలో మళ్లీ బాలాజీ బ్లాక్​ మెయిల్​​కు పాల్పడ్డాడు. చంపుతానని, ప్లాట్ లను కబ్జా చేస్తానని బెదిరించాడు.

బాలాజీ సూత్రావే బెదిరింపులకు సంబంధించిన కాల్స్​ను అరవింద్ తన ఫోన్​లో రికార్డు చేసి వాటిని పోలీసులకు సమర్పించాడు. వాటి ఆధారంగా పోలీసులు బాలాజీపై 386 ,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ ​చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.